బతుకమ్మ,మోర్తాడ్: రెండు స్పీకర్లు ఒక బేస్ తో కలిపి డిజలను ఆపరేట్ చేసుకోవడానికి చట్టానికి లోబడి పోలీసు ఉన్నతాధికారుల అనుమతి ఇవ్వడం జరిగిందని భీమ్ గల్ సిఐ నవీన్ తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం పలువురుతో ఆయన మాట్లాడారు. డీజే లు పెట్టుకుంటున్న సమయంలో దగ్గర ఇండ్లలో పేషెంట్లు, చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారికి దూరాన్ని పాటించాలని డిజి ఆపరేటర్లకు తెలిపారు. డీజే ఆపరేటర్లు ఎటువంటి రుసుము చెల్లించకుండా పోలీస్ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకుని సంవత్సర కాలం పాటు లైసెన్స్ పొందగలరని వివరించారు. నిబంధనలు అతిక్రమించిన డీజేలను సీజ్ చేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఎస్సై విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

