ఇందల్వాయి, బతుకమ్మ:
ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి రైల్వే స్టేషన్ గేటు సమీపంలో గల బ్రిడ్జి వద్ద అకస్మత్తుగా రైలు నుండి జారి పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మృతుడు మేడ్చల్ డబిల్పుర గ్రామానికి చెందిన ఎండి రఫీ గా గుర్తించారు. మృతుడు నిజామాబాద్ ఫంక్షన్ కు వచ్చి తిరుగుప్రయాణంలో భాగంగా రైలులో వెళ్తున్న సమయంలో డోర్ దగ్గర ఉండడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

