నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 12 నుండి 17 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 99 కేసుల నమోదు చేయడం జరిగింది. వారిని కోర్టు లో హాజరు పరచగా వీరికి రూ: 5,80,000/- జరిమానా విధించడం జరిగింది. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరని ఐపీఎస్ సాయి చైతన్య అన్నారు.
