- అన్నివిధాల బాలున్ని ఆదుకుంటామని హామీ
భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మెండోరా గ్రామంలో తల్లిదండ్రులు మరణించి అనాథగా మారిన పదేళ్ల బాలుడు మహర్ష్ ను కానిస్టేన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ కుమార్ ఆదివారం పరామర్శించి, ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహార్ష్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని, భవిష్యత్ లో బాలుని చదువుకు సహకారం చేస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
