27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

భూభారతి పనులను వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలి
  • ఆర్డీవో రాజేందర్

 

ఇందల్వాయి, బతుకమ్మ : మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆర్డిఓ రాజేందర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సంస్థ గురించి తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు.భూభారతి లో వచ్చిన దరఖాస్తులను త్వరితిగతిన ఆన్లైన్ చేయాలని ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు. మండల పరిధిలో భూభారతి కార్యక్రమం అమల్లో ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలకు అనుగుణంగా భూ సర్వే రికార్డుల సరిదిద్దడం, డిజిటల్ రికార్డుల నవీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన సూచించారు. ప్రజలకు పారదర్శకమైన భూ రికార్డులు అందుబాటులో ఉండేలా అధికారులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు పనుల పురోగతిని రోజువారీగా నివేదించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ వెంకటరావు, డిప్యూటీ తాహసిల్దార్, శైలజ, ఆర్.ఐ ప్రసాద్, జిపిఓ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article