23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

మున్సిపల్ కార్మికులకు ఒకే షిఫ్ట్ లో డ్యూటీ కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ కార్మికులకు ఒకే షిఫ్ట్ లో డ్యూటీ కేటాయించాలని, చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం, అంత్యక్రియల ఖర్చు 20వేలు, ఔట్సోర్సింగ్ కార్మికులు యూనిఫామ్ సబ్బులు నూనెలు రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీయూసీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడం అందజేశారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి భూమయ్య పాల్గొన్నారు.

More articles

Latest article