మెండోరా, బతుకమ్మ:మెండోరా మండల కేంద్రంలో మహిళా సమైక్య శాఖ ( ఐకేపీ) ఆధ్వర్యంలో సోమవారం వరి కొనుగోలు కేంద్రాన్ని వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి ,తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం గంగా రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగ ఎపీఎం గంగారాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు నాణ్యమైన వరి ధాన్యంను కొనుగోలు కేంద్రంకు తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలలో ,రైతులు గ్రామ విఓఏ లు, అధ్యక్షురాండ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
