- హైదరాబాద్ సిపి సజ్జనార్
హైదరాబాద్, బతుకమ్మ : రౌడీలు.. స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతాం.. అని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు చాదరగట్టి విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఘటన జరిగింది. రౌడీ షీటర్ మొబైల్స్ స్నాచర్స్ ఇద్దరూ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారు. రౌడీ షీటర్ మమ్మద్ ఉమర్ అన్సారిపై 20కి పైగా కేసు నమోదు అయ్యాయి,రెండు పిడి యాక్ట్ లు నమోదు చేశాం. రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. దొంగను చేజ్ చేస్తూ పట్టుకునేందుకు డీసీపీ తన గన్ మెన్ వచ్చారు. దొంగ కత్తితో గన్ మెన్ పై దాడి చేసాడు. వెంటనే డీసీపీ చైతన్య రెండు రౌండ్లు దొంగ పై కాల్పులు జరిపారు. దొంగకు చేతిపై,కడుపులో గాయాలయ్యాయి. దొంగకు మాలకపేట యశోద ఆసుపత్రికి తరలించాము.పరారీ లో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నాం. రౌడీలు.. స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతాం.. డీసీపీ స్వల్ప అస్వస్థత కు గురయ్యారు.. గాయలైన కానిస్టేబుల్ లు ఇద్దరూ ఆసుపత్రి లో క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం. మహమ్మద్ ఉమర్ అన్సారీ,కేసులు, నేరాలు, అతనికి సహకరిస్తున్న వారిని గుర్తిస్తాం.తగు చర్యలు తీసుకుంటాం.