మెండోరా, బతుకమ్మ:మెండోరా మండల కేంద్రంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగిన ట్లు వేణుగోపాల్ చారి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మెండోరా గ్రామానికి చెందిన రాజరాం భార్గవి భర్త రవి అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న దేవుని దగ్గర పూజ కార్యక్రమం నిర్వహించి భార్గవి దీపం వెలిగించింది. అననంతరం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళింది. కాలనీ వాసులు పొగ,మంటలను గుర్తించి తాళం పగలగొట్టినప్పటికీ ఇంట్లో ఉన్న టీవీ,, ఫ్రీడ్జ్,బియ్యం బస్తాలు,15 వేల రూపాయల నగదుతో పాటు ఇంట్లో ఉన్న సామాను మొత్తం పూర్తిగా కాళీ బూడిద అయ్యాయి. బాధిత కుటుంబం నిరుపేద కుటుంబం కావటంతో ఒక్క సారిగా దుఃఖసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ చారి ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ” లక్ష వరకు ఆస్థినష్టం జరిగినట్టు అంచనా చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
