28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

చికెన్ అడిగాడని కొడుకును చంపిన తల్లి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ :  చికెన్ అడిగాడని ఓ తల్లి కొడుకును చంపింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో చోటు చేసుకుంది. పాల్ఘర్‌లోని  కాశీపాద ప్రాంతంలో  పల్లవి ఘుమ్డే(40) కుటుంబం నివసిస్తోంది.   కొడుకు చిన్మయ్ గణేష్(7), కూతురు(10)  చికెన్ తినాలని ఉందని తల్లిని  అడిగారు. దీంతో కోపంలో పల్లవి చపాతీ రోలర్‌తో పిల్లలిద్దరిపై దాడి చేసింది.  పిల్లల అరుపులు విని స్థానికులు లోపలికి వెళ్లారు. స్పాట్ లోనే చిన్మయ్ గణేశ్ మృతి చెందాడు. కూతురుకి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పల్లవిపై  పాల్ఘర్‌ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదైంది.

 Mother kills son for asking for chicken

నిందితురాలు పల్లవి ఘుమ్డే

 

More articles

Latest article