ఎల్లారెడ్డి, బతుకమ్మ : దుర్గమాత నవరాత్రుల సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సుమారు 11 అమ్మవారి మండపాల స్వాములు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డి పురోహితులు చెప్పిన విధంగా అక్టోబర్ 3న అమ్మవారి శోభాయాత్ర నిర్వహించాలని శనివారం ఉదయం లోపు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని అన్ని మండపాల నిర్వాహకులకు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ప్యాలాల రాములు, పిన్నూరి రమేష్, శంభు, తులసీదాస్, శివప్రసాద్, సోమయాజుల సాయి, ఓలపు సాయి ,భరత్, భాను ప్రసాద్, ఫణింద్ర ప్రసాద్ ,కుక్కల ప్రశాంత్ పాల్గొన్నారు.
