25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి

 

భిక్కనూర్, బతుకమ్మ : విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని,విధిగా మెనూ పాటించాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సూచించారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంత్రుల పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో బుష్ క్లియర్ చేయాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్యప్రణాళిక ఎక్కడి వరకు పూర్తయింది అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకోనీ విజయం దిశగా సాగాలని సూచించారు. విద్యార్థినులు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని ,క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులకు విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

Provide quality food to students

More articles

Latest article