బతుకమ్మ, కోటగిరి : ఎత్తోండా ప్రాథమిక సహకార సంఘంలో 13 కోట్ల రూపాయలు అవకాతవకలైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ డబ్బులను రికవరీ చేయాలని గతంలో డిసిసిబి ద్వారా పాలకవర్గానికి సిబ్బందికి నోటీసులు జారీ చేసిన పట్టించుకోకపోవడంతో అవకతవకలకు గురైనా సొమ్మును వెంటనే రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశానుసారం రెవెన్యూ ఆక్ట్ చట్టం ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 14మంది పాలకవర్గ డైరెక్టర్లు సిబ్బందికి ఆస్తుల జప్తు కొరకై గురువారం నోటీసులు జారీ చేసినట్టు స్థానిక ఎంఆర్ఓ గంగాధర్ తెలిపారు.
