27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పిల్లి శ్రీకాంత్ ను సన్మానించిన జిల్లా న్యాయవాదులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ జిల్లా ఐటీ ఇన్చార్జి గా నియమితులైన యువ న్యాయవాది పిల్లి శ్రీకాంత్ ను శుక్రవారం న్యాయవాదులు సన్మానించారు న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు జిల్లా పార్టీ పదాధికారిగా ఐటి ఇన్చార్జిగా నియమితులు కావడం చాలా శుభ పరిణామం అన్నారు. రాబోవు రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మురళీధర్, బిట్ల.రవి, సుభాష్ రెడ్డి, కేశవ్, నరేష్, శంకర్, పుణ్య రాజ్, మధుసూదన్,నారాయణ, అన్వేష్, వెంకటేష్, శ్రీ మన్, రాజశేఖర్, విక్రమ్, రోహన్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article