- విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన కేకే
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్దిపేట మండల కేంద్రంలో ఆటో బోల్తా పడి అశ్విని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాలుడిని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది గురువారం పరామర్శించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో మాట్లాడి గాయపడిన విద్యార్ధికి వైద్య ఖర్చుల కింద ఆర్ధిక సహాయం అందించాలని కేకే జిల్లా కలెక్టర్ ను కోరారు. అనంతరం వైద్యులతో బాలుడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు.కేకే వెంట పార్టీ మందల అధ్యక్షులు సద్ది లక్ష్మా రెడ్ది, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడీ రాం రెడ్ది, బండారి బాల్ రెడ్ది, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, చెన్ని బాబు, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, గంట బుచ్చ గౌడ్, నంది కిషన్,పందిర్ల లింగ గౌడ్, అంతేరుపుల గోపాల్ తదితరులు ఉన్నారు.
