బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మండపం లో బాన్సువాడ, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ ని ప్రభుత్వ సలహదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మజరైన పోచారం శ్రీనివాస్ రెడ్డికి సబ్ కలెక్టర్ కిరణ్మయి స్వాగతం పలికారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మెన్ కాసుల బాలరాజ్, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల , బాన్సువాడ, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గోన్నారు.
