24 C
Hyderabad
Sunday, August 2, 2026

పాఠశాలలకు, కళాశాలలకు సెలవు!

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వెబ్‌డెస్క్‌

రేపు శుక్రవారం పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ 20వ తేదీన మావోయిస్టులు బందుకు పిలుపునిచ్చారు. దీంతో పాఠశాలలు, కళాశాలలకు, కొంతమంది ఉద్యోగులకు కూడా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణిచివేతలో భాగంగా ఆపరేషన్‌ కగార్‌ చేపడుతోంది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఎంతోమంది మావోయిస్టులు చనిపోగా మరికొందరు అరెస్ట్‌ కూడా అయ్యారు. కాగా ఆపరేషన్‌ కగార్‌ ఆపాలని నిరసనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు జూన్‌ 20వ తేదీన తెలుగు రాష్ట్రాల బందుకు పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల ప్రజలు సహకరించాలని వారు అభ్యర్థించారు. దీంతో బంద్‌ నిర్ణయం వల్ల శుక్రవారం సెలవు వచ్చే అవకాశం ఉంది. మావోయిస్టుల బందు పిలుపుకు కొన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు కూడా మద్దతు తెలియజేసి బందును విజయవంతం చేసే దిశగా ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి.

More articles

Latest article