30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ సాయిచైతన్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ప్రారంభించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం సీపీ ప్రారంభించి పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో అత్యంత సమస్యాత్మక పోలీస్ స్టేషన్ లలో ప్రధానమైన 6వ టౌన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను

CP Sai Chaitanya launches CCTV cameras

నియంత్రించేందుకు అవకాశం కలిగిందని సీపీ అన్నారు.  పోలీస్ స్టేషన్ ను పరిశీలించి స్థానిక పెద్దలతో సమస్యలపై చర్చించారు. అదే విధంగా ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా నేరాల గురించి ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, న్యాయం చేస్తామని సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, ఎస్సై వెంకట్రావు, స్థానికులు పాల్గొన్నారు.

CP Sai Chaitanya launches CCTV cameras14523

More articles

Latest article