24 C
Hyderabad
Sunday, August 2, 2026

పాత బస్తీలో ఈడీ సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

భూదాన్ మహేశ్వరం భూముల వ్యవహారంలో..

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని పాత బస్తీలోని యాకుత్ పురా, సంతోష్ నగర్ లో ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. భూదాన్ మహేశ్వరం భూముల వ్యవహారంలో ఈతనిఖీలు చేపట్టారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు  ఈఐపీఎల్ కంపెనీ భూములు విక్రయించింది. ఈ ఐపీఎల్ కంపెనీకి బినామీగా సుకూర్ ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తుంది. ఈక్రమంలో సుకూర్, అతడి బంధువు షర్పన్, మరో ఇద్దరి ఇళ్లలో సోదాలు జరిపింది.  ఇదే కేసులో ఐఏఎస్ అమోయ్ కుమార్, మహేశ్వరం తహసీల్దార్ ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

More articles

Latest article