నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగరంలోని గోల్డెన్ బూబ్లీ చౌరస్తాలో కూడళి పేరు మారుస్తూ బోర్డు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ గాజులపేట్, బురుడుగల్లీకి చెందిన మేదరి, మున్నూరు కాపు, మంగలి కులస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఘటనాస్థలానికి సీఐ శ్రీనివాస్ రాజు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి విరమింపజేశారు. ఎస్సై 2 టౌన్ యాసర్ అరాఫత్, ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
