బోధన్, బతుకమ్మ: బైక్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వర్ని మండలం గోవూర్ గ్రామానికి చెందిన లాలు బైక్ పై వెళ్తుండగా బోధన్ మండలం లంగ్డాపూర్ బ్రిడ్జిపై లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లాలు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
