రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో గల హనుమాన్ ఆలయం వద్ద గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7 గంటలకు చావా మూవిని ప్రదర్శించారు. మరాఠ సామ్రాజ్య యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పుత్రుడు శంభాజీ మహారాజ్ సనాతన హిందూ ధర్మం, హిందూ మతం గురించి ఈ మూవిలో చక్కగా ప్రదర్శించారు. హిందూ ధర్మం గురించి ప్రజలకు తెలియజేయడానికి గ్రామంలో చావా మూవిని ప్రదర్శించినట్లు గ్రామాభివృద్ధి కమిటీ నిర్వాహకులు తెలిపారు.

