బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఓ మహిళ దూకి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన మెండోరా మండలంలో చోటుచేసుకుంది. నిర్మల్ భాగ్యనగర్ కు చెందిన శృతి కొడుకుని తీసుకొని ఎస్సారెస్పీ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి ఎస్సై నారాయణకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని తల్లీ కొడుకులను కాపాడి కుటుంబ సభ్యులకి అప్పగించారు.
