అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ
వెబ్ న్యూస్, బతుకమ్మ : విదేశీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్రమోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ లో ఉన్న ’బ్లెయిర్ హౌస్‘లో మోదీ బస చేయనున్నారు. కాగా, ఈభవనానికి 200 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. అమెరికా అధ్యక్షుల అతిథులకు ప్రత్యేక వసతి కేంద్రంగా ఈభవనం గుర్తింపు పొందింది. ఈభవనం రెండో యజమాని ప్రీస్టన్ ప్రాన్సిస్ బ్లెయిర్ పేరిట దీనికి బ్లెయిర్ హౌస్ గా నామకరణం చేశారు.
