24 C
Hyderabad
Sunday, August 2, 2026

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • టీ ఎస్ న్యాబ్ డీఎస్పీ సోమనాథం

బతుకమ్మ, నిజామాబాద్ : యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని టీ ఎస్ న్యాబ్ డీఎస్పీ సోమనాథం అన్నారు. నగరంలో శుక్రవారం గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవధ్ధన్నారు. మత్తు పదార్థాలు సేవించి కొందరు నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. మత్తుకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర సిఐ నరహరి, 3వ టౌన్ ఎస్సై నర్సయ్య, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Intoxicants should be avoided

More articles

Latest article