బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండల కేంద్రంలో గల కాలువలో పడి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. లక్ష్మి కాలువలో ముప్కాల్ గ్రామానికి చెందిన తేజ (18) అనే యువకుడు ప్రమాదవ శాత్తు కాలువలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

