రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన సున్నం యోగేష్ (25) అనే యువకుడు అదృశ్యమైనట్లు రుద్రూర్ రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. యోగేష్ ఈ నెల 21 న మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై బోధన్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి ఇంటికి తిరిగి రాలేదని, ఎంత వెతికినా యువకుడి జాడ తెలియలేదన్నారు. యోగేష్ తండ్రి దత్తాత్రి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. అదృశ్యమైన యోగేష్ ఆచూకీ తెలిసినచో రుద్రూర్ ఎస్సై ఫోన్ నెం. 8712659876 కి సంప్రదించాలన్నారు.
