భిక్కనూరు, బతుకమ్మ: వేక్ అప్ వింటర్ నినాదంతో భిక్కనూర్ సీఐ సంపత్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 2.5కే రన్ నిర్వహించారు. ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు నిర్వహించిన రన్ లో సర్కిల్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ ల సిబ్బంది, సౌత్ క్యాంపస్ విద్యార్థులు పాల్గొన్నారు. లింగుపల్లి చౌరస్తా నుంచి తెలంగాణ యూనివర్సిటీ వరకు రన్ కొనసాగింది. డీఎస్పీ నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భిక్కనూర్ ఎస్సై సాయికుమార్, ఆంజనేయులు, పుష్ప రాజ్ తదితరులు పాల్గొన్నారు.

