- జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : మద్యం షాప్ ల దారాఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి మద్యం దుకాణాల నిర్వహిణకు గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 102 వైన్ షాప్ లకు 88 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను 31దరఖాస్తులు వచ్చాయన్నారు. ధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు 13 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు 22 దరఖాస్తులు వచ్చాయన్నారు. భీంగల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్లకు గాను 11 దరఖాస్తులు, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాప్లకు గాను 11 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.