రుద్రూర్, బతుకమ్మ :
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అన్నీ గ్రామాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ గ్రామంలోని పోలీస్ స్టేషన్, గాంధీ చౌక్, గ్రామపంచాయతీ కార్యాలయం, సహకార సంఘం, తహసీల్దార్ కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయం, ఐకేపి, బేజెపి పార్టీ కార్యాలయం, అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసి 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, తహశీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ బాల గంగాధర్, ఎస్సై పి.సాయన్న, స్థానిక మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

