నాలుగు నిమిషాల్లో రూ.30లక్షలు చోరీ

0 1,296

. గ్యాస్ కట్టర్, ఇనుప రాడ్లతో ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు

రంగారెడ్డి, బతుకమ్మ: నిమిషాల వ్యవధిలో డబ్బులు కొల్లగొట్టే ముఠాలను సినిమాల్లో చూస్తుంటాం. సినిమా స్ర్కిప్ట్ ను తలదన్నేలా నాలుగు నిమిషాల వ్యవధిలో దుండగులు రూ.30లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున స్విప్ట్ కారులో వచ్చిన నలుగురు దుండగులు ఎస్బీఐ ఏటీఎం వద్దకు చేరుకుని ముందుగా సీసీ కెమెరాలకు బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. ఎమర్జెన్సీసైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేసిన దుండగులు.. గ్యాస్ కట్టర్ ఏటీఎం మిషన్ కొంత భాగాన్ని కట్ చేసి ఇనుప రాడ్లతో ధ్వంసం చేశారు. ఏటీఎంలో ఉన్న రూ.30లక్షల నగదును బ్యాగుల్లో సర్దుకుని పరారయ్యారు.

Leave A Reply

Your email address will not be published.