మెండోరా, బతుకమ్మ : మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామంలోని చౌరస్తాలో మెండోరా ఎస్ఐ సుహాసిని ఆధ్వర్యం లో శుక్రవారం 2 కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 2K రన్ నిర్వహించమని పేర్కొన్నారు. ఇందులో మెండోరా మండలంకు చెందిన సుమారు 150 మంది వరకు యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
