ములుగు, బతుకమ్మ : ములుగు జిల్లా కేంద్రంలో అవినీతి అధికారిని ఏసీబీ అధికారలు దాడి చేసి పట్టకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జడ్పీ కార్యాలయంలో రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సూపరింటెండెంట్ సుదాకర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టకున్నారు. అవినీతి లావాదేవీలతో సంబంధం ఉందన్న అనుమానంతో జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. తోటి ఉద్యోగి ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరినీ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
