బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధిరామేశ్వర నగర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వేల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ రఘు మాట్లాడుతూ యోగతో సంపూర్ణ ఆరోగ్యం శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడంతోపాటు ఈ పురాతన అభ్యాసన పక్రియలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు ప్రశాంత్, సంధ్య, వైస్ ప్రిన్సిపాల్ బి. కిషన్, పి వెంకటేశం, చంద్రపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.

