ఎల్లారెడ్డి, బతుకమ్మ: నీటిలో మునిగి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం జన్కంపల్లి కుర్దు తండాకు చెందిన మెగావత్ అన్సీ(42) ఈనెల 2న తన ఆవులను మేపడానికి తన గ్రామ శివారులోకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై అన్సి భర్త వసురాం ఆమె కోసం వెతకగా తన ఆచూకీ ఎక్కడ దొరకలేదు. దీంతో ఉదయం 6 గంటలకు గ్రామ శివారులో గల రామసముద్రం చెరువులో అన్సి శవం తేలి కనబడింది. తన భార్య చెరువులో నీరు త్రాగడానికి వెళ్లిన ఆవులను తోలే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈత రాక మునిగి చనిపోయిందని అని ఆమె భర్త వాసురాం (వస్రం)ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

