మోర్తాడ్,బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇండ్లు లేని పేదలకు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం మోర్తాడ్ ఎంపీడీవో తిరుమలగిరి భూమి పూజ చేశారు. నిర్మాణాలు చేసుకుంటున్న లబ్ధిదారులకు దశలవారీగా డబ్బులు వస్తాయని అటువంటి ఇబ్బందుల గుడి కావద్దని ఆమె లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ పృథ్వీరాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రంజిత్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
