రుద్రూర్, బతుకమ్మ : సీజ్ చేసిన ఇసుక డంపులను వేలం ఎప్పుడు వేస్తారోనని మండలవాసులు చర్చించుకుంటున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో సుమారు డంప్ చేసిన 22 ట్రిప్పుల ఇసుకను సీజ్ చేసి ఐదు రోజులవుతోంది. సీజ్ చేసిన అక్రమ ఇసుక డంపులకు వేలం ఇంకెప్పుడు వేస్తారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.