- సిపిఐ పార్టీ జిల్లా నాయకులు సిహెచ్ సాయ గౌడ్
ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని అకాల వర్షాలు కురవడంతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని సిపిఐ జిల్లా నాయకులు సిహెచ్ సాయ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాలను పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకంలో మోసాలు నీట మునిగి నష్టపోయిన వరి పొలాలకు ఒక ఎకరానా 50 వేల రూపాయలు చొప్పున రైతులకు మొక్కజొన్న,పత్తి,మినుములు,పెసర్లు పంటలకు కూడా ఎకరానా 30000 రూపాయలు చొప్పున ప్రభుత్వ నష్ట ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాంబాబు, సాయిలు,మీనా,పుష్ప, నరసయ్య,శంకర్ తదితరులు పాల్గొన్నారు.
