రుద్రూర్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని అంగన్వావాడి ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈనెల 12న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నామని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయికు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్, యూనియన్ నాయకులు పద్మ, గంగామణి, రూప తదితరులు పాల్గొన్నారు.
