27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సిపిఎస్ రద్దుకు ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం

Must read

📰 Generate e-Paper Clip

  • పి ఆర్ టి యు సర్వసభ్య సమావేశంలో వక్తలు

బతుకమ్మ, నిజామాబాద్ : రాబోయే కాలంలో సిపిఎస్ రద్దు దిశగా ప్రభుత్వాన్ని ఇప్పిస్తామని తెలిపారు. టిఆర్టియు కామారెడ్డి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం స్థానిక కళాభారతాడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా సంఘం చేపట్టిన కార్యక్రమాలను సాధించాల్సిన సమస్యల పట్ల అవగాహన కల్పించారు. విద్యా వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం పిఆర్టియు అని తెలిపారు. ప్రమోషన్లలో మిగిలిపోయిన వెజిటేబుల్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను కూడా పూర్తి చేయించే విధంగా సంఘం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, శాసనమండలి సభ్యులు కూర రగోతంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భట్టాపురం మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ పాల్గొన్నారు

More articles

Latest article