- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తా లోని టీఎన్జీవో భవన్ లో నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం

ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో టీఎన్జీవో ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్టార్ విందులో ఉద్యోగులతో పాల్గొనడం చాలా ఆనందంగా వుందన్నారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.

