మెండోరా, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 12 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీ లోకి 1,61,251 విసెక్కుల నీరు అతి చేరుతుంది. ప్రాజెక్టు ప్రధాన గేట్ల ద్వారా 35, 293 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 6735 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా శుక్రవారం 1090.40 అడుగులు, 78.276 టిఎంసిల నీరు నిల్వ ఉంది.