ఏర్గట్ల, బతుకమ్మ :
నూతనంగా కొలువుదీరిన ఏర్గట్ల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం ఏర్గట్ల మండల తాసిల్దార్ జె మల్లయ్య, ఎస్సై పి రాజేశ్వర్ లను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుండాల ముత్తెన్న, ఉపాధ్యక్షుడు సుదనవేణి నాగరాజ్ గౌడ్, కోశాధికారి ముస్కు నర్సింగ్, కరెంటు శాఖ ఇన్చార్జ్ దండ బోయిన (మేకల) సాయన్న, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

