ఢిల్లీ, బతుకమ్మ : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. వైద్య పరమైన కారణాలను చూపుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను సమర్పంచారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2022 ఆగస్టులో ధన్ ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
