- కమీషనర్ గోపు గంగాధర్
భీమ్ గల్, బతుకమ్మ : విశ్వానికి ధర్మం, న్యాయం, సత్యం, సేవా మార్గాలను చాటి చెప్పిన ఆదికవి, మహా కవి వాల్మీకి మహర్షి అని మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ అన్నారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మద్రామాయణ మహా కావ్యాన్ని రచించిన మహనీయడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.