25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

గణపతి మండపాన్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నగరం లోని హమాల్ వాడి గాంధీ గణేష్ మండలి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హోమం, అన్నదానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సనాతన ధర్మ రక్షణకై యావత్ హిందూ సమాజం యువతి, యువకులు చిన్నారులంతా కలిసి భక్తి శ్రద్దలతో గణపతి నవరాత్రులు నిర్వహించడం హిందువుగా గర్వించదగ్గ విషయం అన్నారు. హిందువుల పై జరుగుతున్నా దాడులను దృష్టిలో పెట్టుకొని హిందువులంత ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ,35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుదీర్ , విక్కీ యాదవ్, ఎర్రం గంగాధర్, రంజిత్, బీజేపీ నాయకులు ఆనంద్, పవన్ ముందడ,హరీష్, బాబీసింగ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Urban MLA visited Ganapati Mandapam

More articles

Latest article