నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉమ్మడి కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన టీచర్ ఎమ్మెల్సి మల్కా కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సి చిన్నమైల్ అంజిరెడ్డిని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ సోమవారం శాలువాతో సత్కారించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణాలో బిజెపి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ మోసపూరిత పాలన అంతానికి ఇది ఆరంభం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, హామీలు మరిచి మోసపురితంగా వ్యవహారిస్తున్న కాంగ్రెస్ కు మేధావులు, పట్టభద్రులు, టీచర్స్ అందరు ఏకం అయ్యి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బిజెపి పార్టీ ముందుకు పోతుందని అన్నారు.

