నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు చెందిన జిల్లా క్రీడాకారుడు తాడూరి దీక్షిత్ అంతర్జాతీయ పుషూ క్రీడాపోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మంగళవారం అభినందించారు. దీక్షిత్ ఇటీవల కర్ణాటకలో నిర్వహించిన సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు సెలెక్ట్ అయ్యాడు. ఈ నెల 17 నుంచి 22 వరకు జార్జియా దేశంలో జరగనున్న పోటీల్లో పాల్గొననున్నాడు.
అంతర్జాతీయ క్రీడలకు ఎంపికైన క్రీడాకారున్ని అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే
