నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ఆలయం వద్ద బిక్షాటన చేసే మహిళ మృతి చెందినట్లు 3వ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. జనవరి 10వ తేదిన కంఠేశ్వర్ ఆలయం ఎదుట గత కొన్ని రోజులుగా భిక్షాటన చేస్తూ చనిపోయిందని ఆమె వయస్సు సుమారు 40 – 45 వరకు ఉంటుందన్నారు. ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. గుర్తుతెలియని మహిళా మృతదేహం గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిసినచో 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు లేదా ఫోన్ నెంబర్ 8712659839 కు సంప్రదించాలన్నారు.
