హైదరాబాద్, బతుకమ్మ: బీసీ రిజర్వేషన్లు అమలు చేసే వరకు ఉద్యమిస్తామని, ఇక నుంచి తెలంగాణ జాగృతికి అనుబంధంగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్(యూపీఎఫ్) పని చేస్తుందని జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్మ్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో ఫూలే ఫ్రంట్ నాయకులతో కవిత సమావేశమై నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సలహాదారుగా గట్టు రామచంద్రరావు వ్యవహరించనుండగా కన్వీనర్ గా బొల్లా శివశంకర్, కో ఆర్డినేటర్ గా ఆలకుంట హరితోపాటు 50 మందిని సహా కన్వీనర్లుగా నియమించారు.
